కామారెడ్డి : జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి గ్రామానికి చెందిన విజయ (26) అనే యువతి కరోనా వైరస్ బారిన పడి మృతి చెందింది. విజయ ప్రస్తుతం తాడ్వాయి మండలంలో తాసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం మృతురాలి జన్మదిన కావడం గమనార్హం.
విజయ గతంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీగా ఉద్యోగం దక్కించుకున్నారు. కొద్దికాలం సెక్రటరీగా విధులు నిర్వర్తించి అనంతరం రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా మరో ఉద్యోగం సాధించారు. స్వల్ప కాలంలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విజయ గతంలో అనేక మంది ప్రశంసలు పొందారు. విజయ తండ్రి పద్మాజివాడి లో వెల్డింగ్ షాపు నిర్వర్తిస్తున్నారు.