న్యూఢిల్లీ: విపక్షాల నోరు నొక్కేయాలన్న ప్రధాన అజెండాతోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత బిల్లును తీసుకొచ్చిందని కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు.
ఈ చట్టం పోలీసులకు క్రూరమైన అధికారాన్ని కట్టబెడుతుందని, వీటిని అధికార పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటాయని ఆరోపించారు. కొత్త చట్ట ప్రకారం పోలీస్ కస్టడీ గడువు 15 రోజుల నుంచి 60 లేదా 90 రోజులకు మారుతుందన్నారు.