Navjot Singh Sidhu | పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab Chief Minister) భగవంత్ మాన్ (Bhagwant Mann)పై కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సందర్భంలో భగవంత్ మాన్ తనని కలిశారని.. కాంగ్రెస్ పార్టీ (Congress)లో చేరేందుకు ఆయన ఆసక్తి చూపారని తెలిపారు. తనకు డిప్యూటీగా పనిచేసేందుకు మాన్ సుముఖంగా ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీలో చేరుతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై విలేకరులు సిద్ధూను ప్రశ్నించారు. ‘మీరు బీజేపీలో చేరుతున్నారా..? లేదంటే మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా..?’ అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను ఎవరైనా సంప్రదించారా అనే దాని గురించి మీకు ఓ విషయం చెప్పగలను. భగవంత్ మాన్ సాహబ్ ఓసారి నా వద్దకు వచ్చాడు. నేను అతనిని (మాన్ని) కాంగ్రెస్లో చేర్చుకుంటే.. తను నాకు డిప్యూటీగా ఉండటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అలా లేదంటే నేను ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)లోకి వెళ్లినా.. అతను నాకు డిప్యూటీగా ఉండటానికి సిద్ధమే అని చెప్పాడు’ అని సిద్ధూ పేర్కొన్నారు.
అయితే, తాను రాహుల్, ప్రియాంకగాంధీకి బద్ధుడినై ఉన్నానని, వారిని విడిచిపెట్టి రాలేనని స్పష్టంగా చెసినట్లు పేర్కొన్నారు. తను కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టయితే అధిష్ఠానంతో మాట్లాడతానని చెప్పానన్నాడు. ఆ తర్వాత ఈ విషయంలో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలూ జరగలేదని వివరించారు. పంజాబ్ ప్రజలకు సేవ చేయడమే తన ఏకైక లక్ష్యమని సిద్ధూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సిద్ధూ చేసిన ఈ వ్యాఖ్యలు పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Also Read..
flight loses tyre | విమానం టేకాఫ్ కాగానే ఊడిన చక్రం.. వీడియో
Dolly Sohi | గర్భాశయ క్యాన్సర్తో టీవీ నటి మృతి
Kedarnath Yatra | మే 10న కేదార్నాథ్ ఆలయం ఓపెన్