ముంబై, జనవరి 23: గవర్నర్ పదవి ఇక చాలని, పదవి నుంచి దిగిపోతానని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సోమవారం ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ముంబై వచ్చినప్పుడు ఇక తాను పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్టు ఆయనతో చెప్పినట్లు కోశ్యారీ తెలిపారు. తన శేషజీవితం ఇక చదువుతూ, రాస్తూ, ఇతర కార్యక్రమాలతో గడిపేస్తానని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర లాంటి గొప్ప రాష్ర్టానికి గవర్నర్గా పని చేయడం తనకు దక్కిన గౌరవమన్నారు. కోశ్యారీ ఇంతకుముందు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదం రేపాయి.