WhatsApp Scams | న్యూఢిల్లీ, జనవరి 21: సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో అనేక కేసులు ‘వాట్సాప్’తో ముడిపడి ఉన్నాయని, హ్యాకర్లు, మోసగాళ్లు ‘వాట్సాప్’ ద్వారా మోసాలకు పాల్పడే అవకాశముందని కేంద్ర హోంశాఖ ఆధీనంలోని మేధోసంస్థ బీపీఆర్డీ హెచ్చరిక జారీచేసింది. వీటిని అడ్డుకునేందుకు కేంద్ర హోం శాఖకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. గుర్తు తెలియని, అనుమానాస్పద నంబర్లతో వచ్చే వాట్సాప్ కాల్స్ను స్వీకరించరాదని యూజర్లకు సూచించింది.
‘జాబ్ ఆఫర్లు ఉన్నాయంటూ, పెట్టుబడి పథకాలు చెబుతామంటూ హ్యాకర్లు ఆయా వ్యక్తులకు వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ ద్వారా గాలం వేస్తున్నారు. ఆయా వ్యక్తుల సున్నితమైన సమాచారం సేకరించాక వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. వియత్న్నాం, కెన్యా, ఇథియోపియా, మలేషియా నుంచి హ్యాకర్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు’ అని బీపీఆర్డీ నివేదిక పేర్కొన్నది. వాట్సాప్లోని ‘స్క్రీన్ షేర్’ ఆప్షన్తో సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.