చివరకు పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచేశారు. 137 రోజుల గ్యాప్ తర్వాత ఇంధన ధరలు పెరిగాయి. మంగళవారం నాడు పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసలు పెరిగింది. అయితే.. తాజాగా పెరిగింది ఒక్క పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాదు. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. మార్చి నెలలో ఒక్కసారిగా చాలా వస్తువుల ధరలను పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు మోయలేని భారం పడినట్టే.
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు పాల ప్యాకెట్ల ధరలు కూడా పెరిగాయి. అముల్, మదర్ డెయిరీ, పరాగ్ లాంటి కంపెనీలు లీటర్ పాల ప్యాకెట్లపై 2 రూపాయలు పెంచాయి. మధ్యప్రదేశ్కు చెందిన సాంచి అనే కంపెనీ ఒకేసారి లీటర్కు రూ.5 పెంచింది.
అలాగే.. ఇంట్లో వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు గ్యాస్ ధరలు పెరగలేదు. తాజాగా ఒక సిలిండర్పై రూ.50 పెంచారు. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.949.50గా ఉంది.
అలాగే.. కంప్రెషెడ్ నాచురల్ గ్యాస్ ధరలను కూడా పెంచారు. సీఎన్జీని ఇప్పుడు ఎక్కువగా వాహనాల్లో వాడుతున్నారు. మార్చి 8నే సీఎన్జీ ధరలను పెంచారు.
టూ మినట్స్ ఇన్స్టంట్ ఫుడ్ మ్యాగీ ధర కూడా పెరిగింది. మ్యాగీని తయారు చేసే నెస్లే కంపెనీ ఇటీవలే మ్యాగీ ధరను 2 రూపాయలకు పెంచింది. ఇదివరకు మ్యాగీ చిన్న ప్యాకెట్ రూ.12 ఉండేది. ఇప్పుడు రూ.14 చేశారు. పెద్ద ఫ్యాకెట్ల మీద 3 రూపాయలు పెంచారు. మ్యాగీ ప్యాకెట్లతో పాటు.. నెస్కేఫె క్లాసిక్, బ్రూ, తాజ్ మహల్ టీ పౌడర్ ధరలు కూడా పెరిగాయి.