కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మృతిచెందారు. కూచ్బెహర్లోని దిన్హతాలో బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేయగా, బారవిటలో బ్యాలెట్ పేపర్లకు నిప్పుపెట్టారు. ఎన్నికలు బ్యాలెట్తో జరగాలని, బుల్లెట్లతో కాదని రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ హితవు పలికారు. ఎన్నికల అధికారులు టీఎంసీకి సహకరిస్తున్నారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. ఎన్నికలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత కౌస్తవ్ బాగ్చీ కోల్కతా హైకోర్టుకు లేఖ రాశారు.