కోల్కతా: పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గుడ్బై చెప్పారు. అలీపురద్వార్ బీజేపీ ఎమ్మెల్యే సుమన్ కంజీలాల్ ఆదివారం తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.
2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు తృణమూల్లో చేరారు. బీజేపీకి పట్టుందని భావించే ఉత్తర బెంగాల్ నుంచి ముగ్గురు పార్టీ మారారు. దీంతో అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 68కి పడిపోయింది.