తృణమూల్ కాంగ్రెస్లో చేరిక
కోల్కత్తా, మే 22: పశ్చిమబెంగాల్లో బీజేపీకి దెబ్బమీద దెబ్బ తగులుతున్నది. కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు, ఎంపీ అర్జున్సింగ్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆదివారం ఆయన తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.
2019 లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు. బరాక్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. దాదాపు మూడేండ్ల తర్వాత తిరిగి సొంతగూటికి చేరారు.