కోల్కతా: పార్టీ నుంచి సస్పెండైన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై వివాదస్ప వ్యాఖ్యలు చేయడంపై శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని హౌరాలో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పోలీస్ వాహనాలు, అవుట్ పోస్ట్కు నిప్పుపెట్టారు. అలాగే స్థానిక బీజేపీ కార్యాలయానికి కూడా నిప్పుపెట్టారు. ఈ నేపథ్యంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, హింసాత్మకంగా మారిన హౌరాకు శనివారం బయలుదేరారు. అయితే పోలీసులు మార్గమధ్యలో ఆయనను అడ్డుకుని అరెస్ట్ చేశారు.
కాగా, పోలీసులు తొలుత నివాసం వద్దనే సుకాంత మజుందార్ను నిరోధించేందుకు ప్రయత్నించారు. హౌరాలో ప్రస్తుతం నెలకొన్న శాంత్రి భద్రతల పరిస్థితుల నేపథ్యంలో అక్కడకు వెళ్లవద్దని ఆయనకు సూచించారు. అయితే తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బారికేడ్ల పై నుంచి దూకిన సుకాంత, హౌరాలోని పంచల పట్టణానికి వెళ్లసాగారు. మార్గమధ్యలో ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.