భాగల్పూర్, డిసెంబర్ 31: ఒక పాత విమానాన్ని తీసుకెళ్తున్న ట్రక్కు వంతెన కింద ఇరుక్కుపోయిన ఘటనను మరువక ముందే అలాంటిదే మరో ఘటన బీహార్లో చోటుచేసుకుంది. పాత రైలు కోచ్ను తీసుకెళ్తున్న ఒక ట్రక్కు ఆదివారం భాగల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపుతప్పి లోహియా బ్రిడ్జి రెయిలింగ్ను ఢీకొంది. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
పోలీసులు, రైల్వే అధికారులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్ది ట్రాఫిక్ను పునరుద్ధరించారు. కాగా, పాత విమానాన్ని లక్నో నుంచి అస్సాంకు తీసుకెళ్తున్న ఒక ట్రక్కు శుక్రవారం మధురై వద్ద ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే.