కోల్కతా: బంగ్లాదేశ్ అవామీ లీగ్కు చెందిన ఎంపీ అనర్వుల్ అజిమ్ అనార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో పోలీసులు కొత్త విషయాన్ని బయటపెట్టారు. హత్యకు గురికావడానికి ముందే ఆ ఎంపీ హనీ ట్రాప్(Honey Trap) అయినట్లు నిర్ధారించారు. ఓ మహిళ ఆ ఎంపీని బోల్తా కొట్టించి.. హత్యకు గురైన ప్లాట్కు తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ వద్ద షిలస్తీ రెహ్మాన్ అనే మహిళతో ఎంపీ అన్వరుల్ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.
మే 12వ తేదీన ట్రీట్మెంట్ కోసం కోల్కుతా ఆ ఎంపీ వచ్చారు. మిత్రుడు గోపాల్ బిశ్వాస్ ఇంట్లో ఆయన ఉన్నారు. న్యూ టౌన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఆయన్ను చివరిసారి చూశారు. మహిళతో ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఆ ఎంపీని హత్య చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. షీలాస్తీ రెహ్మాన్ అనే మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఓ బంగ్లాదేశీ అక్రమ వలసదారుడిని పట్టుకున్నారు. ఆ మహిళ హనీ ట్రాప్ చేసిన తర్వాత ఎంపీని హత్య చేసి ఉంటారని విచారణలో అనుమానిస్తున్నారు. ఈ మర్డర్ కేసులో మరో నలుగురు బంగ్లాదేశీలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
అమెరికాలోని బంగ్లాదేశీ సంతతికి చెందిన అక్తరుజ్మాన్ ఈ హత్య వెనుక కీలక వ్యక్తి అయి ఉంటారని అనుమానిస్తున్నారు. షీలాస్తీ రెహ్మాన్కు అతను తెలుసు అని పోలీసులు వెల్లడించారు. అన్వరుల్ను చంపేందుకు కిల్లర్స్కు 5 కోట్లు సుపారీ ఇచ్చినట్లు విచారణలో తెలిసింది. ఎంపీ అన్వరుల్ చర్మాన్ని తొలిచి, ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి ప్లాస్టిక్ ప్యాకెట్లలో మంసాన్ని నింపి పారేసినట్లు విచారణలో తేలింది.