బెంగళూరు: పెండ్లి అనగానే అమ్మాయిలు ఏవేవో కలలుకంటూ ఉంటారు. తాము అలా ఉండాలి, ఇలా ఉండాలి, వివాహ వేడుకలో తామే ప్రత్యేక ఆకర్షణగా నిలవాలి, డిఫరెంట్గా తయారవ్వాలని చూస్తారు. అందరిలానే తానూ అనుకుంది ఓ వధువు. రెండు రోజుల్లో వివాహం ఉండగా.. మేకప్ (Makeup)కోసం ఇంటివద్ద ఉన్న ఓ బ్యూటిపార్లర్కు (Beauty parlour) వెళ్లింది. బ్యుటీషియన్ ఆమె ముఖానికి అప్లయ్చేసిన ఫేస్మాస్క్ వికటించింది. దీంతో ఆమె మొహం నల్లగా మారడంతోపాటు వాపువచ్చింది. ఆమెను చూసిన వరుడు (Groom) పెండ్లిని (Wedding) రద్దుచేసుకున్న ఘటన కర్ణాటకలోని (Karnataka) హసన్ (Hassan) జిల్లాలో చోటుచేసుకున్నది.
హసన్ జిల్లాలోని ఆరాసికేర్ గ్రామానికి ఓ యువతికి వివాహం నిశ్చయమైంది. ఎంగేజ్మెంట్ కూడా పూర్తయింది. మరో రెండు రోజుల్లో పెండ్లి జరుగనుంది. దీంతో తాను మరింత అందంగా కనిపించాలనుకున్న ఆమె.. తన ఇంటివద్ద ఉన్న ఓ బ్యూటిపార్లర్కు వెళ్లింది. కొత్తగా ఏదైనా ట్రై చేయాలని బ్యుటీషియన్కు చెప్పింది. దీంతో బ్యూటిషియన్ ఆ కాబోయే వధువు మొహానికి ఏదో పౌండేషన్ (Foundation) అప్లయ్ చేసింది. అనంతరం స్టీమ్ చేయడంతో మొహం కమిలిపోయింది. దీంతో చర్మం నల్లబడటంతోపాటు, మొహం మొత్తం వాపువచ్చింది. అదిచూసిన పెండ్లి కొడుకు వివాహాన్ని రద్దుచేసుకున్నాడు.
అయితే దీనికంతటికీ కారణమైన బ్యూటీపార్లర్ యజమాని గంగపై, అందులో పనిచేస్తున్న బ్యుటీషియన్పై వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో వారికి సమన్లు జారీచేసిన పోలీసులు కేసును దర్యాప్తుచేస్తున్నారు.