హైదరాబాద్ : భారత సైన్యంతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) రూ.471.41 కోట్ల కాంట్రాక్టు కుదుర్చుకుంది. మిస్సైల్స్ తయారీకి సంబంధించిన జరిగిన ఈ ఒప్పందంపై గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇరువైపు ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. దీని ప్రకారం బీడీఎల్ మిస్సైల్ తయారీ కాంట్రాక్ట్ గడువు మరో పదేండ్లు పెరిగింది. దీనిలో భాగంగా బీడీఎల్ గైడెడ్ మిస్సైల్స్, అసోసియేట్ పరిరకాలు, అండర్వాటర్ వెపన్ సిస్టమ్, తదితర యుద్ధ పరికరాలు బీడీఎల్ తయారు చేయనుంది.