న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులకు త్వరలోనే వారానికి ఐదు రోజుల పని విధానం అమలయ్యే అవకాశం ఉన్నది. ఈ మేరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ చేస్తున్న డిమాండ్ను పరిశీలిస్తున్నట్టు ఇండియా బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) తెలిపింది. అయితే, ఈ విధా నం అమలు చేయాలంటే వారంలో ఐదు పని దినాల్లో రోజుకు 40 నిమిషాల పాటు పని వేళలు పెంచాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనివేళలు ఉండే అవకాశం ఉంటుంది.