భోపాల్ : మధ్యప్రదేశ్లో బజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలు రెచ్చిపోయారు. జబల్పూర్లోకి కాంగ్రెస్ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీసును ధ్వంసం చేశారు. బజరంగ్ దళ్ కార్యకర్తల వీరంగాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కేకే మిశ్రా తీవ్రంగా ఖండించారు.
#WATCH | Madhya Pradesh: Banjrang Dal workers vandalise Congress office in Jabalpur. pic.twitter.com/BFU0LaPZPP
— ANI (@ANI) May 4, 2023
హింసాకాండ, అల్లర్లు, హత్యలు, గూండాయిజానికి పాల్పడటం, గర్బాలో పాల్గొనే మహిళల గురించి ఆరా తీయడం వంటి పనులు బజరంగ్ దళ్ కార్యకర్తలు చేస్తుంటారని అన్నారు. బజరంగ్ దళ్ జాతీయవాద సంస్ధని సీఎం చెబుతున్నారని, ఆయన ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోనే బజరంగ్ దళ్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారని మిశ్రా అన్నారు.
జాతీయ వాదులు ఇలాంటి పనులు చేస్తారా అని ప్రశ్నించిన మిశ్రా దీనిపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. మంత్రుల పిల్లలందరూ బజరంగ్ దళ్లో చేరాలని సీఎం సర్క్యులర్ జారీ చేయాలని మిశ్రా కోరారు. బజరంగ్ దళ్ జాతీయవాద సంస్ధ అయితే సీఎం ఈ ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు.
Read More