కోల్కతా, మే 31: మనసుకు నచ్చిన ప్రియుడిని పెండ్లి చేసుకునేందుకు ఓ యువతి ఏకంగా భారత్ సరిహద్దును దాటింది. అందుకోసం ఎంతో ధైర్యం చేసి సుందర్బన్ అడవుల్లోని నదిని గంట పాటు ఈదుకుంటూ భారత్లోకి ప్రవేశించింది. కృష్ణ మండల్ అనే 22 ఏండ్ల యువతికి భారత్లోని అభిక్ మండల్ అనే యువకుడితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కృష్ణకు పాస్పోర్టు లేకపోవడంతో గంటపాటు నదిలో ఈదుకుంటూ భారత్లోకి అడుగుపెట్టింది. కోల్కతాలోని కాలీఘాట్ గుడిలో ఇద్దరూ 4 రోజుల కింద పెండ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు లు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఓ పిల్లాడు ఇష్టమైన చాక్లెట్ కోసం బంగ్లాదేశ్ నుంచి కంచె దాటి భారత్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.