లక్నో : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. రూ. 50 వేల రివార్డు ఉన్న బంగ్లాదేశ్ క్రిమినల్ హమ్జాను యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. గడిచిన రెండేండ్లలో మూడు దోపిడీ కేసుల్లో హమ్జా ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు యూపీ పోలీసులు తెలిపారు. ఢిల్లీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో హమ్జా ముఠా దోపిడీలకు పాల్పడింది.
బంగ్లాదేశ్లోని ఖుల్నా జిల్లాకు చెందిన హమ్జా రూ. 10 వేలు లంచం ఇచ్చి భారత్లోకి ప్రవేశించినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే సోమవారం తెల్లవారుజామున 2:45 గంటలకు లోహియా పార్కు వద్ద ఆయుధాలను కలిగిన వ్యక్తులను పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు.