న్యూఢిల్లీ, జూలై 26: జపాన్లోని చిబాలో జరిగిన 64వ అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్లో బెంగళూరు విద్యార్థి అతుల్(17) గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఒలింపియాడ్ పోటీల్లో 118 దేశాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. ఆరుగురు విద్యార్థులతో కూడిన భారత్ బృందానికి రెండు గోల్డ్ మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్ దక్కాయి. గణితంపై అమితమైన ఇష్టానికి కఠిన శ్రమ తోడవ్వటంతో ఈ విజయం దక్కిందని అతుల్ విలేకర్లతో చెప్పాడు.