న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటువాదాన్ని బలంగా వినిపించే ‘జమ్ముకశ్మీర్ నేషనల్ ఫ్రంట్’ (జేకేఎన్ఎఫ్)పై కేంద్రం ఐదేండ్లపాటు నిషేధం విధించింది. ‘ఉపా’ చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. జేకేఎన్ఎఫ్ ఆ రాష్ట్రంలో ప్రజల మధ్య అసంతృప్తి బీజాలు నాటుతున్నదని, దేశ భద్రత, సార్వభౌమత్వానికి హాని తలపెట్టే కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నదని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.