జైపూర్: గణేశుడిని పోలినట్టుగా ఉన్న శిశువుకు ఒక మహిళ జన్మనిచ్చింది. ముఖం వద్ద తొండం మాదిరిగా ఉన్న ఆ బాబును చూసి వైద్యులు, సిబ్బంది, స్థానికులు ఆశ్చర్యపోయారు (Baby resembling God Ganesha). అయితే 20 నిమిషాల తర్వాత ఆ శిశువు మరణించాడు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అల్వార్ జిల్లాకు చెందిన ఒక మహిళ జూలై 31న రాత్రి 9.30 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు ముఖం వద్ద బుల్లి వినాయకుడి మాదిరిగా తొండం వంటిది ఉన్నది. దీంతో ఈ వింత బాలుడ్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. అయితే 20 నిమిషాల తర్వాత ఆ పసి బాబు చనిపోయాడు.
కాగా, జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అసాధారణ రూపురేఖలున్న శిశువులు జన్మిస్తారని దౌసా జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) డాక్టర్ శివరామ్ మీనా తెలిపారు. ఈ నేపథ్యంలో గర్భిణీలు క్రమం తప్పకుండా మెడికల్ చెకప్లు చేయించుకోవాలని సూచించారు. గర్భిణీలను పరీక్షించేందుకు అధునాతన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.