సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్పై సొంత పార్టీ నేత ఆజంఖాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సొంత మనుషులే మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. సొంత మనుషులే తనపై విషం చిమ్మారని కూడా మండిపడ్డారు. జైలు నుంచి విడుదల కావడమే ఆలస్యం… ఆజంఖాన్ అఖిలేశ్ యాదవ్పై విరుచుకుపడటం గమనార్హం.
జైలులో తాను తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆజంఖాన్ వాపోయారు. ఆంగ్లేయుల కాలంలో ఎలాగనైతే ఖైదీలను ఖైదు చేసేవారో, అలాగే ఖైదు చేశారని, జైలు అధికారులు ఘోరంగా వ్యవహరించారని ఆజంఖాన్ వెల్లడించారు. తన బ్యారక్ దగ్గరే ఉరితీసే గది ఉండేదని, ఎలాంటి ఘోరమైన పరిస్థితులను అనుభవించానో, తనకే తెలుసంటూ ఆజంఖాన్ వాపోయారు.
సమాజ్వాది పార్టీ నేత, ఎమ్మెల్యే ఆజంఖాన్ శుక్రవారం సీతాపూర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు రాంపూర్ సరిహద్దుల వద్దకు చేరుకున్న ఆయనకు పలువురు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ఇంటికి చేరుకోనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో సహా భారీ సంఖ్యలో మద్దతుదారులు అజంఖాన్ ఇంటి వద్ద వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆజంఖాన్కు వ్యతిరేకంగా 85 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బెయిల్ రావడానికి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది.