లక్నో, అక్టోబర్ 28: సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత, రాంపూర్ ఎమ్మెల్యే ఆజంఖాన్ శాసనసభ సభ్యత్వం రద్దయింది. 2019 విద్వేష ప్రసంగం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు మూడేండ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆజంఖాన్ శాసనసభ సభ్యత్వం రద్దయినట్టు, రాంపూర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. ఈ మేరకు యూపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రదీప్ దూబే శుక్రవారం వెల్లడించారు. 2019 ఎన్నికల సమయంలో ఓ ఐఏఎస్ అధికారితోపాటు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆజంఖాన్పై కేసు నమోదైంది.