ఎల్లారెడ్డిపేట, జనవరి 21: అయోధ్య రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన కార్వింగ్ కళాకారుడు శ్యామంతుల అనిల్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. రెండు గుమ్మడి కాయలు, అరకిలో క్యారెట్లతో 12 అంగుళాల ఎత్తు, 16 అంగుళాల పొడవుతో నాలుగు గంటలు శ్రమించి ఆదివారం రామమందిరాన్ని నిర్మించారు. అనిల్ గతంలో పుచ్చకాయపై కేసీఆర్, కేటీఆర్ చిత్రాలు, శివుడి ప్రతిమను చెక్కి ఆశ్చర్యపరిచారు.