లక్నో: శ్రీరాముడు లేకుండా అయోధ్య లేదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన కుటుంబసమేతంగా అయోధ్యను సందర్శించారు. రామ్లల్లాకు పూజలు నిర్వహించారు. రామాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రామాయణ్ కాన్క్లేవ్ను ప్రారంభించారు. ఈ కాన్క్లేవ్పై పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడు గిరిజన తెగలతో ప్రేమగా ఉన్నాడని, స్నేహాన్ని సాగించాడన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.