అయోధ్య, డిసెంబర్ 2: అయోధ్యలో నిర్మితమవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం తొలిదశ పనులు ఈ నెల 15 నాటికి పూర్తవుతాయని యూపీ సీఎం ఆదిత్యనాథ్ తెలిపారు. ఇక్కడ నిర్మితమవుతున్న మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, వీకే సింగ్లతో కలిసి పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విమానాశ్రయ మొదటి దశ జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కంటే నెల ముందే పూర్తవుతాయని చెప్పారు. అతి త్వరలోనే రెండో దశ నిర్మాణానికి అనుమతి వస్తుందని తెలిపారు.