ముంబై: బీచ్లో సందర్శకులు సరదా కోసం నడిపే జాయ్ రైడ్ అదుపుతప్పింది. ఒక మహిళతోపాటు ఒంటెపైకి అది దూసుకెళ్లింది. (Ramming ATV Into Camel) ఆ వాహనంపై రైడ్ చేసిన మరో మహిళ కింద పడింది. ఒంటె కూడా గాయపడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పందించిన పోలీసులు, బీచ్ వాహనానికి సంబంధించిన తండ్రీ, కుమారుడిపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని అలీబాగ్లో ఈ సంఘటన జరిగింది. జనవరి 28న స్థానిక బీచ్లో పర్యాటకులు జాయ్ రైడ్ కోసం వినియోగించే ఆల్ టెర్రైన్ వెహికల్ (ఏటీవీ)ను ఇద్దరు వ్యక్తులు నిర్లక్ష్యంగా నడిపారు. దీంతో ఒక మహిళ పక్క నుంచి దూసుకెళ్లిన ఆ వాహనం ఒక ఒంటెను ఢీకొట్టింది. ఆ వాహనంపై ఉన్న మహిళ కింద పడింది. ఆ ఒంటె కూడా గాయపడింది.
కాగా, ఒక వ్యక్తి తన మొబైల్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. బీచ్లోని పర్యాటకులను ఏటీవీపై జాయ్ రైడ్ కోసం తీసుకెళ్లే ఒక వ్యక్తి, అతడి కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Father-son duo booked for rash driving ATV on #Alibaug beach.#accident #Maharashtra pic.twitter.com/99bwO7St2i
— Priyathosh Agnihamsa (@priyathosh6447) February 1, 2024