అత్యాధునిక సాంకేతికత మనదగ్గరుంది: సతీశ్ రెడ్డి
న్యూఢిల్లీ: క్షిపణుల తయారీ సాంకేతికతలో భారతదేశం స్వయం స్వావంబలన సాధించిందని డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి అన్నారు. అత్యాధునిక క్షిపణులను దేశంలోనే తయారు చేసే సాంకేతిక ఇప్పుడు ఇండియా దగ్గర ఉందన్నారు. మంగళవారం జేఎన్యూ వర్సిటీ రక్షణ రంగంపై నిర్వహించిన ఓ ఆన్లైన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పృథ్వి, అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్ క్షిపణులను ప్రస్తావించారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనున్నదని చెప్పారు.