న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఢిల్లీ పోలీస్ కమిషనర్గా వివాదాస్పద ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్థానాను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. రిట్ పిటిషన్తోపాటు పెండింగ్లో ఉన్న పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతిసింగ్ ధర్మాసనం వెల్లడించింది. ఆస్థానా నియామకంలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకోలేదని కోర్టు అభిప్రాయపడింది.