గౌహతి: దేశంలో పెట్రోల్, గ్యాస్తోపాటు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక జంట శివపార్వతుల వేషధారణలో వినూత్నంగా నిరసన తెలిపింది. ఆగ్రహించిన హిందూ సంస్థలు ఆ జంటపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో శివుడు వేషంలో నిరసన తెలిపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో ఈ సంఘటన జరిగింది. నాగావ్కు చెందిన బిరించి బోరా, కరిష్మా శనివారం శివుడు, పార్వతి వేషం వేశారు. సాయంత్రం ఆ వేషధారణలో బైక్పై కాలేజీ చౌక్ ప్రాంతానికి వచ్చారు. బైక్లో పెట్రోల్ అయిపోవడంపై అక్కడ వినూత్నంగా నిరసన తెలిపారు.
శివుడి వేషంలో ఉన్న బోరా ఈ సందర్భంగా ప్రధాని మోదీని విమర్శించాడు. బడా వ్యాపారుల కోసమే కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ధరల పెరుగుదలపై నిరసనలు చేయాలంటూ ఈ నిరసన నాటకాన్ని చూస్తున్న వారినుద్దేశించి అన్నాడు. అనంతరం ఆ జంట బైక్పై బడా బజార్కు చేరుకుని ధరలు పెరుగుదలపై నిరసన నాటకాన్ని ప్రదర్శించింది.
కాగా, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ శివపార్వతుల వేషం వేసి నిరసన తెలిపిన బోరా, కరిష్మాపై నాగోన్ సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బోరాను అరెస్ట్ చేశారు.
మరోవైపు ధరల పెరుగుదలపై శివుడి వేషంలో నిరసన తెలిపిన వ్యక్తిని అరెస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. ఒక వ్యక్తి ట్వీట్ చేసిన విమర్శకు బదులిచ్చారు. అభ్యంతరకరమైన అంశాలు మాట్లాడనంత వరకు దేవుళ్ల వేషధారణ తప్పు కాదని అన్నారు. శివుడి వేషంలో నిరసన తెలిపిన వ్యక్తి అరెస్ట్పై నాగావ్ పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేశామని, దీంతో ఆయన బెయిల్ పొందాడంటూ ట్వీట్ చేశారు.
Assam CM Himanta Biswa Sarma tweets, "Dressing up is not a crime unless offensive material is said. Appropriate order has been issued to Nagaon Police," in connection with the arrest of a protestor who dressed as Lord Shiva & got bail later. pic.twitter.com/dumNbC9m5k
— ANI (@ANI) July 10, 2022