గౌహతి: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తున్నది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సుమారు 93 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. జాలుక్బరి నియోజకవర్గం నుంచి సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Sarma) లీడింగ్లో ఉన్నారు. 35 జిల్లాల్లోని 40 కేంద్రాల్లో ఇవాళ కౌంటింగ్ జరుగుతున్నది.నాగావ్ జిల్లాలో మూడు చోట్ల కౌంటింగ్ జరుగుతున్నది. కోక్రాజార్, టిన్సుకియా, జోర్హాట్ పట్టణాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఏప్రిల్ 9వ తేదీన 126 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అస్సాంలో సుమారు 85.96 శాతం ఓటింగ్ పోలైన విషయం తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం 11 స్థానాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ లీడింగ్లో ఉన్నది. జోర్హాట్ స్థానం నుంచి కాంగ్రెస్ నేత గౌరవ్ గగోయ్ ఆధిక్యంలో ఉన్నారు. తాజా లీడింగ్ రిజల్ట్స్ ప్రకారం మెజారిటీ మార్క్ను బీజేపీ దాటేసింది. బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతున్నది.