గౌహతి : చుక్కలు తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై అసోం బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు లీటర్ రూ. 200కు పెరిగితే బైక్పై ముగ్గురు ప్రయాణించేందుకు అనుమతిస్తామని బీజేపీ నేత భవేష్ కలిట వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధరలు రూ. 200కు చేరితే ప్రభుత్వం బైక్లపై ముగ్గురు ప్రయాణించేందుకు అనుమతించేలా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. తముల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భవేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పాలక కాషాయ పార్టీ నేత చవకబారు వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయన సరదా కోసం ఇలా మాట్లాడారా..లేక సీరియస్గా వ్యాఖ్యానించారా స్పష్టం చేయాలని కాంగ్రెస్ మీడియా వ్యవహారాల చీఫ్ బొబ్బీట శర్మ నిలదీశారు. ఇంధన, నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఆయనకు ఎలాంటి స్పృహ లేదని ఈ వ్యాఖ్యలతో వెల్లడవుతోందని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. మోదీ సర్కార్ హమీ ఇచ్చినా అచ్చే దిన్ అంటే ఇవేనా అని కాషాయ పార్టీని కాంగ్రెస్ నేత నిలదీశారు.