Prisoner Killed | పాట్నా : బీహార్లోని దనపూర్ కోర్టులో దారుణం జరిగింది. అండర్ ట్రయల్ ఖైదీని ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఖైదీని కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అండర్ ట్రయల్ ఖైదీని అభిషేక్ కుమార్గా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పాట్నా సిటీ ఎస్పీ రాజేశ్ కుమార్ తెలిపారు.
#WATCH | Assailants shot dead an undertrial prisoner brought by police to Patna’s Danapur court today. Two accused arrested pic.twitter.com/WLoMVmSqJh
— ANI (@ANI) December 15, 2023