వారణాసి, జనవరి 24: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు శాస్త్రీయ సర్వే రిపోర్టును ప్రజాబాహుళ్యంలో ఉంచకూడదని స్థానిక కోర్టు ఆదేశించింది. ఈ కేసులో పిటిషన్దారులైన ఇరు వర్గాలకు (హిందూ, ముస్లిం వర్గాలు) ఈ రిపోర్టును అందజేయాలని సూచించింది. పిటిషన్దారులు కూడా తాము ఈ రిపోర్టును బహిరంగపర్చమంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే చేపట్టి నివేదికను అందజేయాలన్న ఆదేశాల మేరకు భారత పురావస్తు శాఖ సర్వే చేసి కోర్టుకు రిపోర్టును ఇటీవల సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ రిపోర్టును ప్రజలకు అందుబాటులో ఉంచాలా? వద్దా? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు తీర్పునిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంచకూడదని ఆదేశించింది.