(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్(నమస్తే తెలంగాణ): 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలకు పాల్పడి మెజారిటీ స్థానాల్లో గెలిచిందని ఆరోపిస్తూ అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సబ్యసాచి దాస్ వెలువరించిన పరిశోధనాత్మక పత్రంతో వర్సిటీకి సంబంధం లేదని పేర్కొంది. అయితే, వర్సిటీ ప్రకటనపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరమేమున్నదని వర్సిటీని ప్రశ్నిస్తున్నారు. బలహీనమైన విద్యాసంస్థలే జూనియర్ ఫ్యాకల్టీలను అణిచివేస్తాయని మిషిగన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జోయోజీత్ పాల్ అశోకా వర్సిటీని ఉద్దేశిస్తూ అన్నారు.