న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఢిల్లీ మద్యం పాలసీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసు బోగస్, నకిలీ అని ఆమ్ ఆద్మీ పార్టీ పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఇచ్చిన నోటీస్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ నెల 21న హాజరు కమ్మంటూ ఈడీ ఆదేశించిందని, వాస్తవానికి ఆ రోజు విపాసన కార్యక్రమానికి హాజరవుతారని,ఇది ముందుగా నిర్ణయించిన కార్యక్రమమేనని ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. ఈడీ జారీ చేసిన నోటీసుపై పార్టీ లీగల్ బృందం సమాధానమిస్తుందని తెలిపారు.