న్యూఢిల్లీ, జూలై 17: సింగపూర్లో జరుగబోయే వరల్డ్ సిటీస్ సమ్మిట్కు వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వకపోవడం ప్రధానికి తగదని, అలా చేయడం పొరపాటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఉన్నత వేదికలపై భారత్కు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. అలాంటి సమ్మిట్కు తాను వెళ్లకుండా ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడం సమంజసం కాదని అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఘాటుగా లేఖ రాశారు. ప్రపంచ వేదికపై ఢిల్లీ మాడల్ పాలనను ప్రదర్శించడం గొప్ప అవకాశం భావిస్తున్నట్టు తెలిపారు. సింగపూర్లో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్కు హాజరుకావాలని కోరుతూ సింగపూర్ హై కమిషనర్ సైమన్వాంగ్.. కేజ్రీవాల్కు జూన్ 1న ఆహ్వాన లేఖ పంపారు. ఇందుకోసం కేంద్రం అనుమతి కోరుతూ ఢిల్లీ ఎల్జీ బీకే సక్సెనాకు కేజ్రీవాల్ లేఖ రాశారు. కానీ, ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ఆప్ తెలిపింది.