న్యూఢిల్లీ: ఎనిమిదేళ్లుగా కోమాలో ఉన్న ఆర్మీ ఆఫీసర్(Army Officer) లెఫ్టినెంట్ కల్నల్ కరణ్బీర్ సింగ్ నట్ కన్నుమూశారు. ఆదివారం రోజున అతను ప్రాణాలు విడిచాడు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఆయన మృత్యువుతో పోరాడాడు. టెరిటోరియల్ ఆర్మీలో కరణ్బీర్ పనిచేశాడు. సెనా మెడల్ గెలుచుకున్న అతను.. 2015 నుంచి కోమాలో ఉన్నాడు. జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో జరిగిన ఆపరేషన్ సమయంలో ఓ బుల్లెట్ అతని ముఖంలోకి దిగింది. 160 ఇన్ఫాంట్రీ బెటాలియన్ లో సెకండ్ ఇన్ కమాండ్గా చేశాడు. కుప్వారాలోని హాజి నకా గ్రామంలో నవంబర్ 22, 2105లో ఎన్కౌంటర్ ఆపరేషన్ జరిగింది.
కల్నల్ నట్ 20 ఏళ్ల పాటు ఆఫీసర్గా ఆర్మీలో చేశాడు. ఆ తర్వాత అతను టెరిటోరియల్ ఆర్మీలో చేరాడు. 1997లో అతను ఆర్మీలో జాయిన్ అయ్యాడు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అతను శిక్షణ పొందాడు. పదేళ్ల పాటు ఆర్మీలో చేసిన అతను రెగ్యులర్ ఉద్యోగాన్ని వదిలేశాడు. కానీ ఆ తర్వాత టెరిటోరియల్ ఆర్మీలో చేరాడతను. కుప్వారా ఎన్కౌంటర్ సమయంలో ఓ హట్ కింద దిగిన సమయంలో బుల్లెట్ అతని ముఖంలోకి దిగింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. కానీ ఆ ఆపరేషన్లో ముగ్గుర్ని రక్షించాడతను.