న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవి నుంచి కిరణ్ రిజిజు(Kiren Rijiju)ను తొలగించారు. ఆయన స్థానంలో ఆ శాఖకు అర్జున్ రామ్ మేఘవాల్(Arjun Ram Meghwal)ను నియమించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మరో ఏడాదిలో జరగనున్న నేపథ్యంలో.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజును న్యాయశాఖ నుంచి తొలగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కేంద్ర మంత్రుల్లో రిజిజుకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన్ను ట్రబుల్షూటర్గా భావిస్తారు. న్యాయశాఖను కోల్పోయిన రిజిజుకు ఇప్పుడు ఎర్త్ సైన్సెస్ శాఖను కేటాయించారు.
పార్లమెంట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉన్న అర్జున్ రామ్ మేఘవాల్ ఇప్పుడు న్యాయ శాఖ బాధ్యతలను కూడా చేపట్టనున్నారు. రాష్ట్రపతి కార్యాలయం ఇవాళ ఉదయం ఈ మార్పుపై ఓ ప్రకటన జారీ చేసింది. ప్రధాని మోదీ సలహా మేరకు ఈ మార్పు చేసినట్లు సూచించింది. మంత్రి కిరణ్ రిజిజు కూడా తన ట్విట్టర్ ప్రొఫైల్ను కూడా మార్చేసుకున్నారు.