న్యూఢిల్లీ, జనవరి 2: నోట్ల రద్దు చేసి ఆరేండ్లు గడిచిపోయాయి. అప్పటికి, ఇప్పటికి డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. అయినా, నోట్ల వాడకానిదే హవా నడుస్తున్నది. పైగా, అప్పటికీ ఇప్పటికీ నోట్ల వాడకం రెట్టింపు కావటం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం.. గత డిసెంబర్ 23 నాటికి ప్రజల చేతుల్లో రూ.32.42 కోట్ల విలువైన నగదు ఉన్నది. అదే.. 2016లో పెద్ద నోట్ల రద్దు చేసే సమయానికి ప్రజల వద్ద రూ.17.74 లక్షల కోట్లు మాత్రమే ఉండేది. అంటే.. నోట్ల వాడకం 83 శాతం పెరిగిందన్న మాట. డిసెంబర్ 19న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్.. ప్రజల వద్ద ఉన్న నోట్ల సంఖ్య కూడా 30 శాతం పెరిగిందని వెల్లడించారు.