Bhagavad gita| నెట్ఫ్లిక్స్ కో-ఫౌండర్ కం సీఈవో రీడ్ హాస్టింగ్స్కు కేంద్ర సమాచార, ప్రసారాలశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం భగవద్గీత ప్రతిని బహుకరించారు. ఈ సందర్భంగా తీసిన రెండు ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
కన్జూమర్ కంటెంట్కు సంబంధించి ప్రపంచానికి భారత్ అందిస్తున్న ఆఫర్లపై తమ మధ్య నిర్మాణాత్మక చర్చ జరిగిందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బహుముఖ భాషల్లో వివిధ రకాల అవకాశాలను, ఐడియాలను ప్రపంచానికి భారత్ అందించిందని వ్యాఖ్యానించారు.