న్యూఢిల్లీ: దేశంలో పలు ఈ-రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలోని 284 నగరాల్లో 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల కోసం ఈ- వేలం నిర్వహిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం తెలిపారు.
న్యూఢిల్లీలో జరిగిన ప్రాంతీయ విభాగ రేడియో సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ రేడియో స్టేషన్లను నిర్వహించేందుకు అవసరమైన లైసెన్స్ల ప్రక్రియను ప్రభుత్వం సరళీకృతం చేసిందని చెప్పారు. ముఖ్యంగా కమ్యూనిటీ రేడియో లైసెన్స్కు అవసరమైన అనుమతులను గణనీయంగా తగ్గించిందన్నారు.