భోపాల్, జనవరి 16: కునో నేషనల్ పార్క్లో చీతాల మరణ మృదంగం కొనసాగుతున్నది. తాజాగా మంగళవారం మరో చీతా మృతి చెందింది. దీంతో నమీబియా నుంచి భారత్కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి 10 చీతాలు మృతి చెందినట్టయ్యింది. వీటిలో 7 పెద్దవి, మూడు కూనలు ఉన్నాయి. శౌర్య అనే చీతా మంగళవారం మధ్యాహ్నం మరణించినట్టు ఫారెస్ట్ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ తెలిపారు. శౌర్య మృతికిగల కారణాలు పోస్ట్మార్టం అనంతరమే తెలుస్తాయని పేర్కొన్నారు. నమీబియా నుంచి, దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్కు చీతాలను తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో వదిలారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వివిధ కారణాలతో చీతాలు ఒక్కొక్కటిగా మరణించటం ప్రారంభమైంది.