భువనేశ్వర్ : ఒడిశాలో ఆదివారం ఒకే రోజు 23 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23కు పెరిగింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. ఒడిశాలో తొలిసారిగా డిసెంబర్ 21న రెండు కేసులు నమోదయ్యాయి. నైజీరియా, ఖతార్ నుంచి తిరిగి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తులకు ఒమిక్రాన్ సోకినట్లు గుర్తించారు. ఆ తర్వాత 23న మరో రెండు కేసులు నమోదయ్యాయి. మళ్లీ 30న మరో ఐదు కేసులు రికార్డయ్యాయి.