Anantnag | దక్షిణ కశ్మీర్లోని అనంత్నగర్ జిల్లా కోకెర్నాగ్లో భద్రతా బలగాలు గురువారం సైతం ఆపరేషన్ చేపట్టాయి. సంఘటనా స్థలం వద్ద ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం మేరకు.. అధికారులు పారా కమాండోలను రంగంలోకి దింపారు. ఉజైర్ ఖాన్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులను దాక్కోగా చుట్టుముట్టినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులిద్దరికి లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయని పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అయితే, నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో కర్నల్ మన్ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన హుమాయున్ భట్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.
తీవ్ర గాయాలకు గురైన ముగ్గురు అధికారులు వీరమరణం పొందారు. అయితే, ఉజైర్ఖాన్ కోకెర్నాగ్లోని నాగమ్ గ్రామ నివాసి. అతను జూన్ 2022లో ఉగ్రవాద సంస్థలో చేరగా.. లష్కరే తోయిబాతో సంబంధాలున్నాయి. నిన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. కోకెర్నాగ్లో ఉగ్రమూకలు సంచరిస్తున్నాయన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో అనుమానాస్పద స్థావరం కనిపించగా.. అటువైపుగా వెళ్తున్న సమయంలో అక్కడ నక్కిన ఉగ్రవాదులు బలగాలపైకి కాల్పులు జరిపారు. ఇద్దరు అధికారులకు తూటాలు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ వీరమణం పొందారు.