న్యూఢిల్లీ, ఆగస్టు 21: కాంగ్రెస్లో సంక్షోభం మరింత ముదురుతున్నది. జమ్ముకశ్మీర్లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ నేత, జీ23 అసమ్మతి నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన కొన్ని రోజులకే ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ప్రదేశ్లో పార్టీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ నేత ఆనంద్శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. ఆనంద్ శర్మ కూడా జీ23 గ్రూపులో ఒకరు. ఆజాద్ రాజీనామా చేసిన కొన్ని రోజులకే ఆనంద్ శర్మ కూడా రాజీనామా చేయడం గమనార్హం.