Anand Mahindra | ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తరచూ పలు ఆసక్తికర విషయాలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. తన దృష్టికి వచ్చిన పలు అంశాలను షేర్ చేస్తూ.. ఇతరులకు స్ఫూర్తినిచ్చే వాటిని పరిచయం చేస్తుంటారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.
తాజాగా మరో కొత్త సృజనాత్మకతను నెటిజన్లకు పరిచయం చేశారు ఆనంద్ మహీంద్ర. ఓ బ్యాటరీ వాహనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ వాహనం చూసేందుకు పెద్దసైజ్ బైక్లా కనిపిస్తోంది. వేర్వేరు సీట్లు కలిగిన ఈ పొడవాటి వాహనంలో ఆరుగురు కూర్చోవచ్చు. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర… ‘గ్రామీణ ప్రాంతాల్లోని రవాణారంగ ఆవిష్కరణలు నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఇక్కడ అవసరాలే ఆవిష్కరణలకు మూలం’ అంటూ ట్వీట్ చేశారు.
ఈ వాహనాన్ని తయారుచేసేందుకు రూ.12,000 ఖర్చు చేసినట్లు దాని రూపకర్త తెలిపారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు యువకుడి సృజనాత్మకతకు ఫిదా అవుతున్నారు. ఈ మేరకు వాహన రూపకర్తను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
With just small design inputs, (cylindrical sections for the chassis @BosePratap ?) this device could find global application. As a tour ‘bus’ in crowded European tourist centres? I’m always impressed by rural transport innovations, where necessity is the mother of invention. pic.twitter.com/yoibxXa8mx
— anand mahindra (@anandmahindra) December 1, 2022