ముంబై : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మహింద్ర గ్రూప్ చీఫ్, కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర బుధవారం మరో ఇన్స్పిరేషనల్ పోస్ట్ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. భారత్లో మహిళా కమర్షియల్ పైలట్స్ సంఖ్య 12.4 శాతంతో ప్రపంచంలోనే అత్యధికమని 2021లో ఓ అధ్యయనం వెల్లడించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తన ఫాలోయర్లలో మిడ్ వీక్ జోష్ నింపే ప్రయత్నం చేశారు.
Looking for something to provide mid-week ‘josh?’ Then check this out. Hello world, this is Nari Shakti at work… #MidweekMomentum https://t.co/0gs6jjahii
— anand mahindra (@anandmahindra) November 2, 2022
9.9 శాతం మహిళా పైలట్లతో ఐర్లాండ్ ఈ జాబితాలో రెండో స్ధానంలో నిలవగా 9.8 శాతం మహిళా పైలట్లతో దక్షిణాఫ్రికా మూడో స్ధానంలో నిలిచింది. హలో వరల్డ్, పనిలో మహిళా శక్తి అంటే ఇదే..మిడ్వీక్ మొమెంటర్ అంటూ ఆనంద్ మహింద్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మహింద్ర పోస్ట్కు పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. మీరు విలువైన సమాచారం అందించారని, తాను త్వరలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో మహిళల గణాంకాలను అందిస్తానని ఓ మహిళ రాసుకురాగా భారత్ కొన్ని రంగాల్లో మెరుగైన ప్రతిభతో రాణిస్తోందని మరో యూజర్ కామెంట్ చేశారు.