ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. స్ఫూర్తిదాయక పోస్టులు పెడుతుంటారు. ఇండియన్ లోకల్ టాలెంట్కు సంబంధించిన వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా, ఆయన మట్టితో వినాయకుడి ప్రతిమను చేస్తున్న బాలుడి ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోకు ఆసక్తికర ట్యాగ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోలో బాలుడు బంకమట్టితో గణపతి విగ్రహాన్ని చాలా నేర్పుగా తయారుచేస్తుంటాడు. తన చిట్టిచేతులతో తొండాన్ని తొండాన్ని అందంగా తీర్చిదిద్దాడు. ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ‘ఆ పిల్లవాడు గొప్ప శిల్పి. అతడి చేతులు పెద్ద శిల్పిలాగా గొప్ప నైపుణ్యంతో కదులుతున్నాయి. అతనిలాంటి పిల్లలు వారికి తగిన శిక్షణ పొందారా? లేక వారి ప్రతిభను వదులుకోవాలా?’ అని నేను ఆశ్చర్యపోతున్నాను. అని ట్యాగ్ ఇచ్చారు. అయితే, ఈ ట్వీట్ ఆ బాలుడి పేదరికాన్ని కీర్తిస్టున్నట్టు ఉందని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇంటి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఆ పిల్లాడు ఈ వృత్తి చేపట్టాల్సి వచ్చిందని పలువురు వ్యాఖ్యానించారు.
His hands move with the fluency of a great sculptor. 👏🏽👏🏽👏🏽 I wonder if kids like him get the training they deserve or have to abandon their talent…? https://t.co/XzMgeg930q
— anand mahindra (@anandmahindra) August 28, 2022