న్యూఢిల్లీ : అసాధారణ టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే మహీంద్ర గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) మరోసారి తన ఔదార్యత చాటుకున్నారు. హంగ్జూ వేదికగా ఆసియన్ పారా గేమ్స్లో భారత్కు పలు గోల్డ్ మెడల్స్ సాధించిన 16 ఏండ్ల ఆర్చర్ శీతల్ దేవికి కార్పొరేట్ దిగ్గజం బాసటగా నిలిచారు.
శీతల్ దేవి స్ఫూర్తి, ప్రతిభకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్ర తన కంపెనీ నుంచి ఆమె కోసం కస్టమైజ్డ్ కారు రూపొందించి అందచేస్తానని ప్రకటించారు. ఆర్చరీలో మహిళా ఓపెన్ ఈవెంట్లో శీతల్ దేవి స్వర్ణ పతకం సాధించి సత్తా చాటారు. ఆసియన్ పారా గేమ్స్లో అంతకుముందు రోజు రాకేష్ కుమార్ జోడీగా ఆమె మిక్డ్స్ టీంలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
అనేక సవాళ్లతో ఆమె ప్రస్ధానం సాగడం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. శీతల్ దేవి ప్రత్యేక అవసరాలకు తగినవిధంగా ఆమె కోసం కస్టమైజ్డ్ కారును తయారుచేసి అందచేస్తామని మహీంద్రా గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ వేదికగా ప్రకటించడాన్ని పలువురు నెటిజన్లు స్వాగతించారు.
Read More :